దేశం అభివృద్ధి కావాలంటే వ్యవసాయం అభివృద్ధి కావాలి

– భారత వ్యవసాయ రంగానికి ఎమ్మెస్ స్వామినాథన్ చేసిన సిఫారసులు మరువలేనివి,
– విత్తన రంగంలో నిరంతరం పరిశోధనలు జరగాలి,
– కేరళ తరహాలో కింటాకు 700 రూపాయలు బోనస్ ఇవ్వాలి,
– ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ స్మారక సెమినార్ లో అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు  సారంపల్లి మల్లారెడ్డి.
 నవ తెలంగాణ-సూర్యాపేట:
 భారత వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎమ్మెస్ స్వామినాథన్ చేసిన సేవలు మరువలేనివని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో సిపిఐఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ స్మారకార్థం” భారత వ్యవసాయ రంగం – స్వామినాథన్ సిఫారసులు”  అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2014, 2018 ఎన్నికల సందర్భంగా బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో  స్వామినాథన్ సిఫారసులను దేశంలో అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.  స్వామినాథన్  దేశంలో ఉన్న రైతుల ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలు చేశారని అన్నారు. చేసిన పరిశోధనలకు గాను  అవార్డులు వచ్చాయన్నారు.దేశం అభివృద్ధి కావాలంటే వ్యవసాయం అభివృద్ధి కావాలని అప్పుడే దేశం అభివృద్ధి అవుతుందని అన్నారని అన్నారు. రైతాంగానికి మద్దతు ధర ఇవ్వాలని అనేక సిఫారసులు చేశారని పేర్కొన్నారు. దేశంలో ఉన్న మహిళా రైతుల అభ్యున్నతి కోసం కుటుంబ స్త్రీ పథకం అమలు చేయాలని స్వామినాథన్ సిఫారసు చేశారన్నారు. వ్యవసాయ రంగంలో యువతను ప్రోత్సహించాలని స్వామినాథన్ సూచించారని తెలిపారు. విత్తన ఏర్పాటు సంస్థగా భారతదేశం అభివృద్ధి కావాలని నిరంతరం ఆకాంక్షించారని  అన్నారు. విత్తన రంగంలో వస్తున్న మార్పులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పరిశోధనలు జరపాలని డిమాండ్ చేశారు. దేశంలో 1991 నుండి పీవీ నరసింహారావు, 1994 నుండి డెంకల్ లు ప్రవేశపెట్టిన సరళీ కరణ ఆర్థిక విధానాలు, ప్రతిపాదనల వల్ల దేశంలో సంస్కరణలు వేగవంతం అయ్యాయని  దాని మూలంగా రైతాంగం అనేక సబ్సిడీలను కోల్పోయిందన్నారు. ప్రతి కుటుంబానికి 53 ఎకరాల భూమికన్నా ఎక్కువగా ఉండకూడదని చట్టం చెబుతుంటే పాలకులు ట్రస్టుల పేరుతో వేలాది ఎకరాల భూములను తమ గుప్పెట్లో ఉంచుకొని అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేశంలో భూ సంస్కరణలు అమలు చేసి భూమిలేని పేదలందరికీ  ఒక ఎకరం భూమి ఇవ్వాలని సిఫారసు చేశారని అన్నారు. ఆ సిఫారసు లను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కయని విమర్శించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల మూలంగా దేశంలో అనేక మంది రైతులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 16 వేలమంది రైతులు ఈ సంవత్సరంలో చనిపోయారని తెలిపారు. ఇందులో 6000 మంది రైతులు  ఆత్మహత్య చేసుకున్నారని, 700 మంది రైతులు విద్యుత్ ప్రమాదం మూలంగా చనిపోయారని పేర్కొన్నారు. మిగతా రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక తెచ్చిన అప్పులు తీరక చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతంగం పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం  చెందాయని విమర్శించారు. సిపిఐఎం  నేతృత్వంలోని కేరళ వామపక్ష ప్రభుత్వం మద్దతు ధర తో పాటు 700 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తుందన్నారు. కౌలు రైతులకు రైతు బీమా, రైతుబంధు వర్తింపజేయాలని  డిమాండ్ చేశారు. రైతాంగం తీసుకున్న అన్ని రకాల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని కోరారు. కార్పొరేట్ శక్తులకు లాభం జరిగే చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటు న్నాయని రానున్న ఎన్నికల్లో రైతాంగం బిజెపి, బి ఆర్ఎస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఎమ్మెస్ స్వామినాథన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన మరణాన్ని చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో  తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభనాయక్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరి రావు, బుర్రి శ్రీరాములు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండ వెంకటరెడ్డి, వివిధ ప్రజా సంఘాల నాయకులు జిల్లపల్లి  నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, మేకనబోయిన సైదమ్మ, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, మడ్డి అంజిబాబు,కొప్పుల రజిత, దేవరం వెంకటరెడ్డి, పల్లె వెంకట్ రెడ్డి, షేక్ సైదా, దుగ్గి బ్రహ్మం,కాసాని కిషోర్, కందాల శంకర్ రెడ్డి, గుమ్మడవెల్లి ఉప్పలయ్య, మేకనబోయిన శేఖర్ , స్టాలిన్ రెడ్డి, వజ్జా శ్రీనివాస్, పోషణ పోయిన హుస్సేన్, అవిరే అప్పయ్య, చిన్నపoగా నరసయ్య, ఎం. రాంబాబు, పులుసు సత్యం, చందా చంద్రయ్యతదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-07-04 22:03):

are cbd gummies nuW illegal for minors | cbd gummies help you lose weight bhS | proleve znk cbd infused gummies | most potent gummies of cbd available 7Y7 | martha stewart cbd wellness gummies citrus medley We8 | will cbd gummies show in b0s a drug test | cbd gummy 02D manufacturer colorado | cbd chill gummies nG0 effects | zGt just cbd gummy cherries | five cbd gummies coupon code wrz | eagle hemp cbd 12C full spectrum gummies | green lobster cbd gummies for vW0 quitting smoking | cbd gummies veteran discount WAn | what does a cbd gummy do POX to you | cbd gummy online sale suppliers | purekana cbd gummy online sale | jolly cbd gummies review UOX | 1aL cbd gummies and high blood pressure medication | watermelon cbd thc cS9 gummies | greenergize OMh cbd gummies 3000 mg reviews | first time trying cbd gummies 5gf | best cbd gummies for severe VaL pain | just cbd gummies contact gWq | E5A best stop smoking cbd gummies | cbd gummies for sundowners syndrome j6F | do you need a card for cbd vDg gummies | keoni prA cbd gummies tinnitus reviews | plus cbd gummies y03 reddit | uPH organic cbd gummies kangaroo | cbd gummies san 6fH diego | best bvv cbd gummies royal cbd | mayim bialik cbd gummies company WXc | gummy apple n0g rings platinum cbd | 20 count cbd uiI gummies for sleep | cbd gummy for sale vitamin | vKB hemp bomb cbd gummies 50ct bottle | just cbd Lvd cbd cannabidiol gummies | most effective gummies cbd 25mg | can j0e you take tylenol with cbd gummies | funky farms BiV cbd extracts gummies | can dLI nurses use cbd gummies | diamond cbd oil gummie rings Ume | 10 mg cbd gummies for uQr sleep | just WqO cbd gummies 1000mg reviews | cbd online shop gummies ut | most effective cbd north gummies | do i need a prescription in california for sg9 cbd gummies | HrC plus mango cbd gummies review | prY best cbd gummies for sleep pain and anxiety | natires one cbd x9S gummies