కోర్టులు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది : కపిల్‌ సిబల్‌

న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) తీవ్ర దుర్వినియోగంపై కోర్టులు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ ఎంపీ కపిల్‌ సిబల్‌ అన్నారు. ఈ నెల 2న విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.