నవతెలంగాణ- కంఠేశ్వర్: గత 5 రోజుల క్రితం ఆనారోగ్యంతో మృతిచెందిన ఓ అనాధ వృద్ద శవానికి అంత్యక్రియలను నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 3వ ఠాణా ఎస్.ఐ ప్రవిణ్ అనుమతితో శుక్రవారం దుబ్బ రోడ్డులోని సార్వజనిక్ స్మశాన వాటికనందు సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఆనాధగా చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించడంలో తమ సంస్థ ఎప్పుడు ముందుంటుందని ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు మద్ది గంగాధర్, ఈ.సి మెంబర్ కాసుల సాయితేజ, కార్యవర్గ సభ్యులు మయూర్, జయదేవ్, 3వ ఠాణా పోలిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.