నవ తెలంగాణ ఆర్మూర్: బీసీల సమస్యలపై పోరాటం చేద్దామని ఎన్ఆర్ఐ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు బట్టు స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ ఉపాధ్యక్షులు గురాయి రాజేంధర్ ఎన్ఆర్ఐ బెహరాన్ జక్రాన్ పల్లి మండల అధ్యక్షులు జగడం రవి ఆధ్వర్యంలో తెలంగాణ BC సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ బెహరాన్ మండల కార్యదర్శిగా తీగల గంగాధర్ ని అధ్యక్షునిగా నియమించినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఆర్ఐ అధ్యక్షులు ఉపాధ్యక్షుల వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని బిసి ఎన్ఆర్ఐ లకు ఎటువంటి సమస్యలు వచ్చిన వారికి అండగా ఉంటానని ఎల్లవేళలా BC సంక్షేమ సంఘం కోసం పాటుపడతారని తీగల గంగాధర్ తేలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీసీ అధ్యక్షులు బట్టు స్వామి మరియు ఉపాధ్యక్షులు గురాయి రాజేంధర్ ఎన్ ఆర్ ఐ బెహరాన్ జక్రాన్ పల్లి మండల అధ్యక్షులు జగడం రవి,నాయుడు యాదవ్,ఎ.కైలాస్,వి.గోపి, పి .వినోద్ కుమార్,వంశీ, బీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.