ఇలాంటి క్లైమాక్స్‌ చూసి ఉండరు..

ఇలాంటి క్లైమాక్స్‌ చూసి ఉండరు..తేజ్‌ బొమ్మదేవర, రిషికి లొక్రే జంటగా నటించిన సినిమా ‘మాధవే మధుసూదన’. ఈ చిత్రాన్ని సాయి రత్న క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నిర్మిస్తూ దర్శకత్వం వహించారు బొమ్మదేవర రామచంద్రరావు.
బొమ్మదేవర శ్రీదేవి సమర్పిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న థియేటర్స్‌ ద్వారా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా హీరో తేజ్‌ బొమ్మదేవర మీడియాతో మాట్లాడుతూ, ‘బీబీఏ కంప్లీట్‌ చేశాను. విదేశాలకు వెళ్లి ఎంబీఏ చేద్దామని అనుకున్నా. ఆ టైంలోనే మా నాన్న ఈ కథను రెడీ చేసుకున్నారు. ఆయనతో పాటు నేను కూడా ట్రావెల్‌ చేశాను. ఎంతో మంది వద్దకు వెళ్లి కథ చెప్పాం. కానీ సెట్‌ అవ్వలేదు. చివరకు మా నాన్న నన్నే అడిగారు. నటనలో శిక్షణ తీసుకుని ఇందులో హీరోగా నటించాను. చాలా మంచి కథ. తెలుగులో ఇది కొత్త జోనర్‌లా అనిపిస్తుంది. క్లైమాక్స్‌ అందరినీ టచ్‌ చేస్తుంది. ఇంత వరకు అలాంటి క్లైమాక్స్‌ చూసి ఉండరు. లవ్‌, థ్రిల్‌, కామెడీ ఇలా అన్ని అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమిది. మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌ చేసిన టైంలో హీరో నాగార్జున కొన్ని సలహాలు ఇచ్చారు. ‘నాన్న కష్టపడి పైకి వచ్చారు.. నువ్వు కూడా చాలా కష్టపడాలి.. డ్యాన్సులు బాగా చేశావ్‌’ అని అన్నారు. మున్ముందు ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తాను’ అని చెప్పారు.