– 196మందికి ఊరట
– విద్యుత్శాఖ మంత్రితో ఎంఐఎం ఎమ్మెల్యే భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఇటీవల విద్యుత్ సంస్థల్లో సమ్మె చేసి, విధుల నుంచి తొలగించబడిన 196 మందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొనేం దుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు మంగళశారం రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి, టీఎస్ట్రాన్స్కో,జెన్కో సీఎమ్డీ దేవులపల్లి ప్రభాకరరావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ జీ రఘుమారెడ్డితో ఆర్టిజన్ల తరఫున ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ అబ్దుల్ బలాల, ఆయా సంఘాల ప్రతినిధులు డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సమ్మెలో పాల్గొని, విధులకు గైర్హాజరై, తొలగించబడిన 196 మంది ఆర్టిజన్లను తిరిగి తీసుకుంటూ అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం చేయోద్దని హెచ్చరించారు. మానవీయ దక్పథంతో వారికి తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్టు మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు.