ఇంటా బయటా స్త్రీల పాత్ర కీలకం

జలమండలి ఎండీ దానకిషోర్‌
జలమండలిలో మహిళా
ఉద్యోగులకు ఘనంగా సన్మానం
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒక దేశ నాగరికత ఆ దేశ మహిళలకు ఇచ్చే గౌరవాన్ని బట్టి తెలుస్తుందని ఎండీ దానకిశోర్‌ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జలమండలిలో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎండీ మాట్లాడుతూ ఇంటా బయటా స్త్రీల పాత్ర ఎంతో కీలకమ న్నారు. ఇటు కుటుంబాన్ని, అటు ఉద్యోగాన్ని సమ న్వయం చేసుకుంటూ ముందుకెళ్లటం వారికే సాధ్యమని కొనియాడారు. మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ల లోనే మహిళలకు ఓటు హకఁ్క కల్పించారఁ గుర్తు చేశారు. చాలా ఇబ్బందుల మధ్య మహిళలు పఁ చేస్తారఁ వారందర్నీ గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వివరించారు. మన ఇంట్లో స్త్రీలకు ఎలాంటి గౌరవమి స్తామో కార్యాలయాల్లో ఉద్యోగ సహచరిణిలకు సైతం అలా గే ఇవ్వాలని సూచించారు. జలమండలి పరిధిలో వివిధ హౌ దాల్లో దాదాపు 600 మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 50 మందిని ఎంపిక చేసి ఈ మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా వారిని శాలు వాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్ర మం లో ఈడీ డా.ఎం. సత్యనారాయణ, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌బాబు, రెవెన్యూ డైరెక్టర్‌ వి.ఎల్‌. ప్రవీణ్‌ కుమార్‌, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌-2 స్వామి, టెక్నికల్‌ డైరెక్టర్‌ రవి కుమార్‌, సీజీఎం లు మహమ్మద్‌ అబ్దుల్‌ ఖాదర్‌, దశరథ్‌ రెడ్డి, వినోద్‌ భార్గవ, విజయరావు, టి.వి.శ్రీధర్‌, ప్రభు, పద్మజ, సుజాత, నాగేం ద్ర కుమార్‌, ఆనంద్‌ నాయక్‌, సుదర్శన్‌, అమరేందర్‌ రెడ్డి, వాటర్‌ వర్స్క్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అసోసి యేషన్‌, తెలంగాణ అధ్యకుడు రాంబాబు యాదవ్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్లు రాజిరెడ్డి, జహంగీర్‌, జనరల్‌ సెక్రటరీ జయ రాజ్‌, జీఎంలు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.