హైదరాబాద్ : తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ సంఘం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రోహన్, ఆర్య విజేతలుగా నిలిచారు. మెన్స్ సింగిల్స్ ఫైనల్లో 11-1, 11-0, 11-1తో కరణ్పై రోహన్ గెలుపొందగా.. మహిళల సింగిల్స్ ఫైనల్లో 11-4, 5-11, 11-8, 11-3తో ఐశ్వర్యపై ఆర్య విజయం సాధించింది. రేణుక నీలకంఠ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.