నవతెలంగాణ- భిక్కనూర్
తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుమేరకు ఈనెల 15వ తేదీ శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నారాయణ గుప్త తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూనివర్సిటీ అధ్యాపకులను రెగ్యులర్ చేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు యాలాద్రి, నరసయ్య, రమాదేవి, సునీత, వైశాలి, నిరంజన్, శ్రీకాంత్, సరిత, శ్రీమాతా, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.