మిస్టర్‌ ఎక్స్‌లో కీలక పాత్ర

మిస్టర్‌ ఎక్స్‌అగ్ర కథానాయకులు ఆర్య, గౌతమ్‌ కార్తీక్‌ ప్రధాన పాత్రలలో మను ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న పాన్‌ ఇండియన్‌ మూవీ ‘మిస్టర్‌ ఎక్స్‌’. మంజు వారియర్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రనాఇ్న ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా మేకర్స్‌ మరో బిగ్‌ అప్డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేశారు. అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో స్టైలిష్‌ అండ్‌ ఇంటెన్స్‌ లుక్‌లో శరత్‌ కుమార్‌ కనిపిస్తున్నారు. హై ఆక్టేవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని యాక్షన్‌ సన్నివేశాల్ని మన దేశంతోపాటు ఉగాండా, అజర్‌బైజాన్‌, జార్జియా దేశాల్లో చిత్రీకరిస్తున్నారు. స్టంట్‌ సిల్వా యాక్షన్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ధిబు నినాన్‌ థామస్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, తన్వీర్‌ మీర్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి రచన – దర్శకత్వం: మను ఆనంద్‌, ఎడిటర్‌: ప్రసన్న జికె, ప్రొడక్షన్‌ డిజైన్‌: రాజీవ్‌, ఆర్ట్‌: ఇందులాల్‌ కవీద్‌, అదనపు స్క్రీన్‌ ప్లే: దివ్యాంక ఆనంద్‌ శంకర్‌, రామ్‌ హెచ్‌ పుత్రన్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్‌ పాండి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శ్రవంతి సాయినాథ్‌, సహ నిర్మాత: ఎ. వెంకటేష్‌, నిర్మాత: ఎస్‌ లక్ష్మణ్‌ కుమార్‌.