ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం రిలీజ్ అయిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కతి సనన్ సీతగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. విడుదలైన దగ్గర నుంచి సూపర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంటోంది. రూ.550 కోట్ల భారీ బడ్జెట్తో వచ్చిన ఈ సినిమాకి మార్నింగ్ షో నుంచే మంచి రెస్పాన్స్ వస్తూ ఉండటంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్కి యు.వి. క్రియేషన్స్ వంశీకష్ణ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి మాట్లాడుతూ… మేము మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్.ఎల్.పి వైజాగ్లో పెట్టి ఇంచుమించు ఇది ఆరో నెల. మేము ఆదిపురుష్ సినిమా మా ప్రయత్నం చేస్తే వచ్చింది అనే దానికన్నా, ఆ రాముడు భక్తుడిగా మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్లను ఎంచుకున్నారు అనేది మా నమ్మకం. ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడికి ఇలాంటి గొప్ప సినిమా తీసుకెళ్లడానికి మాకు గొప్ప అవకాశం ఇచ్చారు ఆ రాముడు అని మేము భావిస్తున్నాం. మా మైత్రి నవీన్ కూడా ఈ సినిమా యూఎస్ లో చూసి, శశి చాలా బాగుంది అని చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా నైజంలో టాప్ త్రీ మూవీస్లో ఒకటి అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ప్రతి దగ్గర నుంచి ఒకటే మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని అంటున్నారు. ఫ్యామిలీస్ కూడా ఎక్కువగా వస్తున్నారు. మాట్నీ నుంచే 30 శాతం ఫ్యామిలీస్, లేడీస్ సినిమాకి వస్తున్నారని అంటున్నారు. సాధారణంగా ఆదివారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. కానీ ఈ సినిమాకి మొదటి రోజు నుంచే ఫ్యామిలీస్ రావడం అనేది రామాయణం గొప్పతనం. ప్రతి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతి దగ్గర హౌస్ ఫుల్ అవుతుంది. నైజాంలో మల్టీప్లెక్స్ పరంగా చూస్తే 1000 స్క్రీన్కి పైగా ప్రదర్శించిన సినిమా ఇదే. ఇంతకుముందు ఏ సినిమాకు కూడా ఇలా జరగలేదు. ఖచ్చితంగా ఫస్ట్ వీక్ ఆల్ టైం రికార్డ్ ఈ సినిమా సాధిస్తుందని మేం భావిస్తున్నాం. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు” అని తెలియజేశారు.
పీపుల్స్ మీడియా కతి ప్రసాద్ మాట్లాడుతూ ”మీరు ఇచ్చిన సపోర్ట్కి ధన్యవాదాలు. మీరు ఇంకా ఈ సినిమా చూడకపోతే తప్పకుండా మీ ఫ్యామిలీతో కలిసి థియేటర్స్లో ఈ సినిమా చూడండి” అని తెలియజేశారు.
వివేక్ కుచిబొట్ల మాట్లాడుతూ.. ”ఈ సినిమా మాకు రావడానికి ముఖ్య కారణమైన వంశీకి, విక్కీకి, ప్రమోద్కి ప్రత్యేకమైన ధన్యవాదములు. అలాగే ఈ సినిమా మేం చేసిన వెంటనే ప్రభాస్ని కలిసినప్పుడు ఆయన ఒక కొత్త టైపులో ట్రై చేశాం, త్రీడీలో చాలా బాగుంటుంది అని చెప్పారు. ఇక ఈరోజు సేమ్ అన్ని ఏరియాస్ నుంచి ప్రేక్షకులు అదే చెప్తున్నారు. త్రీడీ చాలా ఎంజారు చేస్తున్నామని తెలియజేస్తున్నారు. ఈ సినిమాకి ఎక్కడా లేనన్ని మార్నింగ్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. ప్రతి షో హౌస్ ఫుల్ అయింది. రామాయణం సినిమాకి ఫాన్స్ నుంచి ఇంత సపోర్ట్ రావడం సంతోషం. అందరూ బాగా ఎంజారు చేస్తున్నారు. ఒక అవెంజర్స్, ఒక హాలీవుడ్ సినిమా ఎలా ఉంటుందో అంతా గొప్పగా గ్రాఫిక్స్ తో ఈ సినిమాని దర్శకుడు తీశారు. మన రామాయణ కథ తర్వాత తరాల వారికి అలానే ఇప్పుడు జనరేషన్కి చాలా సులభంగా అర్థమయ్యేలాగా తీసి దర్శకుడు గొప్ప ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇది మనం సాధించిన అచీవ్ మెంట్” అని తెలియజేశారు.