ఆల్‌ ది బెస్ట్‌ భారత్‌! రోహిత్‌సేనకు

All the best India! To Rohitsena– మద్దతుగా భారత్‌ ఆర్మీ
హైదరాబాద్‌: ఆగస్టు 30న ఆరంభం కానున్న ఆసియా కప్‌లో భారత క్రికెట్‌ జట్టు అంచనాలకు తగ్గట్టు రాణించాలని ఆకాంక్షిస్తూ భారత్‌ ఆర్మీ, ఆరెంజ్‌ ఆర్మీ క్రికెట్‌ అభిమాన సంఘాలు శుభాకాంక్షలు తెలిపాయి. జూబ్లీహిల్స్‌లోని బీ-డబ్స్‌లో సమావేశమైన ఈ రెండు అభిమాన సంఘాలు.. ప్రపంచకప్‌ సమీపిస్తున్న తరుణంలో టీమ్‌ ఇండియాకు మెగా ఈవెంట్‌ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించాయి. బ్యాండ్‌తో మార్చ్‌ఫాస్ట్‌ చేస్తూ.. ఆల్‌ ద బెస్ట్‌ టీమ్‌ ఇండియా అంటూ అభిమానులు నినదించారు. దాదాపు 10 లక్షల సభ్యులు గత భారత్‌ ఆర్మీ 1990 నుంచి టీమ్‌ ఇండియాకు అభిమాన సంఘంగా కొనసాగుతుండగా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు చెందిన ఆరెంజ్‌ ఆర్మీ 2015 నుంచి భారత జట్టుకు మద్దతుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ క్లబ్‌ ఫౌండర్‌ ధర్మ రక్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.