ఈవీఎంలపై ఓటర్లందరూ అవగాహన కలిగియుండాలి 

ఈవీఎంల పనితీరుపై ఓటర్లకు తాశీల్దారులు
ఈవీఎంల పనితీరుపై ఓటర్లకు తాశీల్దారులు
నవతెలంగాణ-బెజ్జంకి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహించనున్న నేపథ్యంతో ఈవీఎంల పనితీరుపై ఓటర్లందరూ అవగాహన కలిగియుండాలని నాయిభ్ తాశీల్దారులు పార్థసారథి తెలిపారు.శనివారం మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామ బస్టాండ్ అవరణం వద్ద ఏర్పాటుచేసిన మొబైల్ వ్యాన్ ద్వార ఈవీఎంల పనితీరు, ఓటు వేసే విధానము, వీవీ ప్యాడ్ ద్వారా ధ్రువీకరించుకునే అంశాలను ప్రజలకు పార్థసారథి వివరించారు. ఓటర్లలో ఈవీఎం యంత్రం పనితీరు ఉపయోగించే విధానం పై అవగాహన కల్పించి ఓటర్లలో చైతన్య పెంపోందించేల ప్రతి గ్రామంలో మొబైల్ వ్యానులను ఏర్పాటు చేసి అవగాహన కల్పించనున్నట్టు పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టెబుల్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి అనిల్, అంగన్వాడీ ఉపాద్యాయురాలు ముక్కీస వెంకట లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.