అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత బలగాలతో ఏర్పాట్లు..

– ఓటు హక్కును వినియోగించుకునేల పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు…
– జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..
నవతెలంగాణ -వేములవాడ
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు  జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా 06  బిఎస్ఎఫ్ కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు జిల్లాకి రావడం జరిగింది జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు సోమవారం.  వేములవాడ సబ్ డివిసన్ కి కేటాయించిన  బిఎస్ఎఫ్ కంపెనీ అధికారులతొ, సిబ్బందితో ఎన్నికల సమయoలో నిర్వహించాల్సిన విధులపై ఎస్పీ  వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్  లో  సమావేశం నిర్వహించారు. ఈ  సందర్బంగా ఎస్పీ అఖిల్ మాట్లాడుతూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో కేంద్ర బలగాలు జిల్లా పోలీసులతో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. కేంద్రం సాయుధ బలగాలు ను క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లలో, రూట్ బందోబస్త్, స్ట్రాంగ్ రూమ్,   కీలకమైన పాయింట్‌ల వద్ద సెంట్రల్ ఫోర్స్ సిబ్బందిని ఉంచడం జరుగుతుంది అన్నారు. అలాగే చెక్ పోస్ట్ దగ్గర పటిష్ట నిఘా ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు  నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి గొడవ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి అధికారి కృషి  చేసి ఎన్నికల విజయవంతం చేయాలని అన్నారు. సమస్యాత్మక గ్రామాలపై  ప్రత్యేక దృష్టి సారించి ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలకు భద్రత భావాన్ని కలిగించాలని అన్నారు.ఎన్నికల పరంగా సదుపాయాల పరంగా ఎలాంటి సమస్యలు ఉన్న అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎస్పి  వేములవాడ సబ్ డివిసన్ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ వివరాలు, చెక్ పోస్ట్ లు, జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి బిఎస్ఎఫ్ అధికారులకు ఎస్పీ  వివరించారు. ఈ సమావేశం లో ఈ సమావేశంలో వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ కరుణాకర్, ఎస్.ఐ రమేష్,  బిఎస్ఎఫ్ కమాండెంట్,  బిఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.