– రైతులు ఆందోళన చెందొద్దు :మంత్రి నిరంజన్రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో యూరియాతోపాటు అన్ని ఎరువులు సరిపడినన్ని ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరమని లేదని తెలిపారు. ఈమేరకు ఆదివారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, ప్రయివేటు డీలర్ల వద్ద 90వేల మెట్రిక్ టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41వేల మెట్రిక్ టన్నులు, మార్క్ఫెడ్ వద్ద 81వేల మెట్రిక్ టన్నులు, కంపెనీ గోడౌన్లలో ఆరువేల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నట్టు పేర్కొన్నారు. మొత్తం 7.57 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులున్నాయని తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో అందుబాటులోకి మరో 18 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని పేర్కొన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని హెచ్చరించారు.