ఆర్డీఓ వెంకటాచారి
నవతెలంగాణ-తుర్కయాంజల్
ఓటరు జాబితా తయారీలో బిఎల్ఓలే కీలకమని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటాచారి అన్నారు. శుక్రవారం తుర్కయాంజల్లోని ఆర్డీఓ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో ఓటరు జాబితాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటరు జాబితాపై వారి సూచనలు సలహాలను స్వీకరించారు. అనంతరం ఆర్డీవో వెంకటా చారి మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తితో ఓటరు జాబితా తయారు చేయాలని బిఎల్ఓలకు సూచించారు. బిఎల్ఓలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల లాంటివారని, ఓటరు జాబితాను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ఓటరు తొలగింపులో జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. బిఎల్ఓలు తమ కర్తవ్యాన్ని సమగ్రంగా నిర్వహించినప్పుడే పారదర్శక మైన ఓటరు జాబితా తయారు అవుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్ల కొరకు ప్రత్యేకమైన పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) పార్టీల నాయకులు కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, సీపీఐ తుర్కయాంజల్ బాద్యులు ఒరుగంటి యాదయ్య, అబ్దుల్లాపూర్ మెట్ మండల జడ్పీటీసీ, కాంగ్రెస్ నాయకులు బింగి దాసు, తహసీల్దార్ అనిత, యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల తహసీల్దార్లు, వివిధ మండలాల బిఎల్ఓలు పాల్గొన్నారు.