కాంగ్రెస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రణవ్ బాబు

 – మద్యం, గంజాయితో యువత నిర్వీర్యం
 – ఆరు గ్యారంటీలను అర్హులందరికీ అందేలా చూస్తా
నవతెలంగాణ-వీణవంక : కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ హామాలను అర్హులందరికీ అందేలా చూస్తానని, నవంబర్ 30న జరగే ఎన్నికలల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి వొడితెల ప్రణవ్ బాబు ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తొలుత వీణవంక మండలంలోని నర్సింగాపూర్, వల్బాపూర్, కనపర్తి, బేతిగల్ గ్రామాల్లో ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కాగా గ్రామాల్లోని మహిళలు, యువకులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు డప్పుచప్పుళ్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని, మహిళలు సంతోషపడేలా ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆరు గ్యారంటీలను తయారు  చేశారని అన్నారు. వారి ఆశిస్సులతో రాష్ర్ట ప్రభుత్వం ఏర్పడగనే వాటిని ప్రతీ గడపకు అందిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతీ మండలంలో యువత ఉద్యోగాల కోసం డిజిటల్ లైబ్రరీలను సొంత డబ్బులతో ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని, ఈ ఎన్నికలల్లో వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉద్యోగనోటిఫికేషన్లు లేకపోవడంతో యువత మద్యం, గంజాయిలాంటి వ్యసనాలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ ప్రాంతంలో యువత ఉద్యోగ కల్పనకు పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లోని యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మెటి సమ్మిరెడ్డి, పత్తి కృష్ణారెడ్డి, కొమ్మిడి రాకేష్ రెడ్డి, చింతల శ్యామ్ సుందర్ రెడ్డి, వల్బాపూర్ ఎంపీటీసీ జీడి దేవేందర్, సాయి పాల్ రెడ్డి, గంగాడి రాజిరెడ్డి, సమ్మిరెడ్డి, కర్ర భగవాన్ రెడ్డి, సాహెబ్ హుస్సేన్, సురేందర్ రెడ్డి, అనిల్ రెడ్డి, గట్టయ్య, మధూకర్ రెడ్డి, వెంకన్న, గూడెపు సారంగపాణి, చొక్కారావు, కిషన్ రావు, ప్రసాద్,  తదితరులు పాల్గొన్నారు.