నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని పోచారం తండాలో గురువారం రోజున కాటన్ సెర్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పీ ప్రజలతో మాట్లాడుతూ.. పోచారం తండావాసులకి గంజాయి రవాణా చేయడం పండించడం నేరమని ఎవరైనా గంజాయిని పండించిన మరియు రవాణా చేసిన రవాణా చేసే వారికి సహాయపడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజల రక్షణ గురించి ప్రజలకు భద్రత భావం కల్పించడం గురించి, ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని, తండాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు గాని, నేరస్తులు గాని వచ్చి షేల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహితంగా చేయాలని ఉద్దేశం గురించి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ని నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. ప్రజలకు మేమున్నామని భరోసా భద్రత కల్పించడం అదేవిధంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఉండేందుకు ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని భరోసా, భద్రత, నమ్మకం కలిగించుట గురించి ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే నేర నియంత్రణ, చేదన లో సీసీ కెమెరాల ద్వారా సులభతరం అవుతుంది అని కావున ప్రతి కాలనీ లో సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. అలాగే ఎమర్జెన్సీ సమయంలో గాని, ఏమైనా సమాచారం గానీ, పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అదేవిదంగా ఈ కాలనీలో వాహనాలు తనిఖీ చేసినప్పుడు చాలా వరకు రిజిస్ట్రేషన్ లేకుండా నెంబర్ ప్లేట్ సరిగా లేకుండా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు రిజిస్ట్రేషన్, లైసెన్స్, ఇన్స్యూరెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలు నడిపే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాత వాహనాలు కొనేటప్పుడు వాటి యొక్క డాక్యుమెంట్స్ చెక్ చేసుకుని లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ కృష్ణ,పెద్ద కొడంగల్ ఎస్సై కోనారెడ్డి, బిచ్కుంద ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, పిట్లం ఎస్సై విజయ్ కొండ, కానిస్టేబుల్ మొదలగు వారు పాల్గొన్నారు.