నవతెలంగాణ-వెంకటాపురం
ప్రజల గొంతుక ఎర్ర జెండా.. ఈ ప్రజా గొంతుకను పేదల పక్షాన వారి సమస్యల పరి ష్కారం కోసం నిరంతరం పోరాడేది ఎర్రజెండా పార్టీ అని ప్రశ్నించే గొంతును అసెంబ్లీ కి పం పించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ అన్నారు. సోమవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో జోన్ కన్వీనర్లు, శాఖ కార్యదర్శులు, ముఖ్యకార్య కర్తల సమావేశం వంకా రాములు అధ్యక్షత న జరిగింది. పార్టీ భద్రాచలం నియోజక వర్గ అభ్యర్థి కారం పుల్లయ్య గెలుపునకు ప్రతి కార్య కర్త కషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ పథకాల కమీషన్లు, లబ్దిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలను ప్రజల్లోకి తీసుకు వెళ్లా లని పిలుపునిచ్చారు. అధికార బీ ఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టులు పేదలు,దళితులను విడిచి పెట్టలేదన్నారు. దళితబంధు పేరుతో లక్షల రూపాయలు దండు కున్నారని విమర్శిం చారు. తీసుకున్న కమీషన్లు దళిత కుటుంబాలకు చెల్లించాకే మండల్లో పర్యటన చేయాలని ఎద్దేవాచేశారు. బీసీ బందులో కమీషన్లు ఇచ్చిన వారినే బీఆర్ఎస్ నాయకులు ఎంపిక చేశారని అన్నారు. ఈ ఎంపికలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పొందేం వీరయ్యతో భద్రాచలం నియో జక వర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు.ప్రభుత్వ పథకాల చెక్కులు పంపిణీ తప్ప గ్రామాల్లో ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదన్నారు. గతంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాం గ్రెస్ పార్టీ ఏజెన్సీకి చేసిన అభివృద్ధి శూన్యం అ న్నారు. ఏజెన్సీ అభివృద్ధి నిధులు సైతం మైదాన ప్రాంతాలకు తరలించుకు వెళ్లారన్నారు.అప్పుడు ఎర్రజెండా ప్రజా ప్రతినిధులు ఉండటం తో పోరాడి అనిధులను వెనక్కు తెచుకున్నామని గుర్తు చేశారు. భద్రాచలం బీఆర్ఎస్ వల్ల ఏజ న్సీకి ఒరిగింది ఏమిటని ప్రశ్నించారు. ఎంపీ గా ఎమ్మెల్యే పోటీ చేసి ఓడి పోయిన తెల్లం వెంకట్రావు భద్రాచలంలో విశాల వంతమైన ఆసుపత్రి భవనాలు నిర్మించి వైద్యం చేసుకుం టున్నారని అన్నారు. పేదల పక్షాన పోరాడేదే ఎర్రజెండా సైనికులు మాత్రమే అన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు సూ డి కష్ణా రెడ్డి మాట్లాడారు. మండల కార్యదర్శి కుమ్మరి శ్రీను ,జిల్లా కమిటీ సభ్యులు గ్యానం వాసు గఫుర్ ,మండల నాయకులు కట్ల చారి,ఆదినారాయణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.