చీకటిపర్వం

చీకటిపర్వంపార్లమెంటు శీతాకాల సమావేశాలు షెడ్యూలు కంటే ఒకరోజు ముందుగానే గురువారం ముగిశాయి. హంగు లతో అధునాతనంగా నిర్మించిన పార్లమెంటు నూతన భవన సముదాయంలో ఈ నెల 4న ప్రారంభమై 21 వరకు సమావేశమయ్యాయి. మూడు క్రిమినల్‌ బిల్లులు సహా మొత్తం 19 బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. లోక్‌సభ 74 శాతం, రాజ్యసభ 79 శాతం ఉత్పాదకత సాధించినట్లుగా ప్రభుత్వం ప్రకటించుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో మొట్టమొదటి సారిగా భారతీయత జోడించిన క్రిమినల్‌ చట్ట బిల్లులను ఆమోదింపజేసుకున్నామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహా రాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి స్వీయభుజకీర్తులు తగిలించు కొని బాకాలూదారు. కానీ వాస్తవంలో జరిగిందేమిటో దేశ మంతా చూసింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండ గానే 2001 డిసెంబరు 13న పార్లమెంటు పాత భవనం పై ఉగ్రవాదులు దాడి జరిగింది. నాటి దాడిలో అమరులైన వారిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్న రోజే పార్ల మెంటు కొత్త భవనంలోకి చొరబడి దుండగులు ఎంతటి భయాత్పోతానికి గురి చేశారో చూశాం. బాంబులతో రంగుల పొగ వదిలి అధునాతన భవనమని మోడీ సర్కార్‌ చెబుతున్న పార్లమెంటు భద్రతా ప్రమాణాల డొల్లతనాన్ని ఈ ఘటన రట్టు చేసింది. చొరబడిన దుండగులకు పాసు లిచ్చిన బీజేపీ ఎంపీని కనీసం ప్రశ్నించేందుకు కూడా మోడీ సర్కార్‌ ఉపక్రమించడం లేదు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాపై అనర్హత వేటు వేయడంతో మొద లైన బీజేపీ అప్రజాస్వామిక ఎత్తుగడలు శీతాకాల సమా వేశాల చివరిరోజు వరకు కొనసాగాయి. భారత పార్ల మెంటు చరిత్రలోనే ఒకే సెషన్‌లో 146 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసి మోడీ సర్కార్‌ ఒక చీకటి పర్వాన్ని లిఖించు కుంది. నూతన పార్లమెంటు భవనం గాండ్రించే సింహత లాటం, రాజదండాలతో నిరంకుశ రాచరికానికి ప్రతిబిం బంగా ఉందని, దాని ఆకారమే ‘శవపేటిక’ను తలపిస్తోం దంటూ విమర్శకులు సంధించిన వ్యంగాస్త్రాలను రుజువు చేసేలా నిరంకుశ చర్యలతో ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో సమాధి కట్టేసింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో కాంగ్రెస్‌, మిజోరంలో జోరాం పీపుల్స్‌ మూవ్‌ మెంట్‌ అధికారంలోకి రాగా మిగిలిన మధ్యప్రదేశ్‌, రాజ స్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన నేప థ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరుగుతాయని భావించినవారికి ఈ సెషన్‌ తీవ్ర అసం తృప్తిని మిగిల్చిందనే చెప్పాలి. భద్రతా వైఫల్యం, గంపగుత్త గా ప్రతిపక్షాల సభ్యులపై వేటు, క్రిమినల్‌ చట్టాలకు సం బంధించిన బిల్లులపై మాట్లాడేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని అధికారపార్టీ మహిళా ఎంపీలే నిట్టూ ర్చడం వంటి ఘటనలతో శీతాకాల సమావేశాలు వాస్తవ రూపు దాల్చిన పీడకలగా నిలిచిపోయాయి. ప్రభుత్వ దుర్మా ర్గపు చర్యలను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలోనే ప్రతిప క్షాలసభ్యులు నిరసన తెలియజేస్తే దానికి కూడా వక్ర భా ష్యాలు అల్లేసి, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కడ్‌కు అన్యాయం జరిగిపోయిందహో అంటూ పార్లమెంటులో బీజేపీ నేతలు చేసిన చేష్టలు విరక్తి పుట్టించే నాటకాన్ని తలపించాయి.
భారత శిక్షాస్మృతి, భారత నేర ప్రక్రియా స్మృతి, భారత సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహి త, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య సంహిత తీసుకొచ్చేందుకు ఉద్దేశించి మూడు బిల్లులను, టెలికమ్యూనికేషన్ల బిల్లును, భారత ఎన్నికల ప్రధాన కమిషనరు, ఇతర ఎన్నికల కమి షనర్ల నియామకానికి సంబంధించిన సవరణ బిల్లు ను ఈ సెషన్‌లో ఆమోదింపజేసుకున్నారు. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను, ప్రజా స్వామ్య హక్కులను కాలరాసే బిల్లులే. ప్రతిపక్ష మంటే ప్రజల గొంతుక. ప్రజల సమస్యలను ప్రస్తా వించేలా చట్టసభల అధిపతులు ప్రతిపక్షాల హక్కు లను కాపాడి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ పార్లమెంటు ఉభయ సభల అధిపతులూ ఈ బాధ్యతను నిర్వహించకపోవడమే గాకుండా ప్రభు త్వానికి వంత పాడి సభా సాంప్రదాయాలను సైతం మంటగల్పారన్న విమర్శలకు శీతాకాల సమావేశాలే తార్కాణం. ఈ నిరంకుశ చర్యలకు చరమగీతం పాడా లంటే మోడీ సర్కార్‌ను సాగనంపడమే మార్గం. ప్రజా స్వామ్య, లౌకిక శక్తులు ఇదే లక్ష్యంతోనే ఐక్యం అవ్వాలి.