బాజిరెడ్డి గెలుపు కోసం మహిళల.. ఇంటింటికి ప్రచారం..

నవతెలంగాణ-  డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్  ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా బీఆర్ఎస్ మహిళలు నడుం బిగించారు.సోమవారం ఇందల్ వాయి మండలం లోని గన్నరం, గౌరరం, లింగపుర్ గ్రామలలో మాజీ సర్పంచ్ చిలువెరి లావణ్య దాస్, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు పులి వసంత ల అధ్వర్యంలో గ్రామలలోని ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, ఈసారి నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశ పెట్టే పథకాలను ప్రజలకు, మహిళలకు వివరి‌ంచారు. ఏ గ్రామంలో ప్రచారం చేసిన ప్రజలనుండి విశేష స్పందన వస్తోందని వారు వివరించారు. ఎమ్మెల్యె బాజిరెడ్డి గోవర్ధన్ గత పదేళ్లుగా రూరల్ నియోజకవర్గంలోని ఇందల్ వాయి మండలంలోని ఆయా గ్రామాలలో గీతం నుండి అభివృద్ధికి నోచుకోని పనులను శాయశక్తులా కృషి చేసి పూర్తి చేసినట్లు వారన్నారు.కారు గుర్తుకే ఓటు వేసి రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజార్టీతో గెలి పించాలని చిలువెరి లావణ్య దాస్, పులి వసంత లు కోరారు. కార్యక్రమంలోముచ్చ నర్సవ్వ, దగ్గి తులశవ్వ, కస్తూరి పేర్ల లక్ష్మి, పేర్ల శారద పిండి నర్సవ్వ,  పందేన బాలమణి, పెందేన భాగీరథి, బొడ్డు రామవ్వ డీకొండ జయ, బొడ్డు లక్ష్మి, మంగలి కళావతి, లలిత, సుమలత తో పాటు మహిళలు బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.