నేడు దోస్త్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ గురువారం విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్‌, దోస్త్‌ కన్వీనర్‌ ఆర్‌ లింబాద్రి, కళాశాల విద్యాశాఖ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌లో విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియతోపాటు షెడ్యూల్‌ను ప్రకటి స్తారు. మంగళవారం ఇంటర్మీడియెట్‌ ఫలితాలు విడుదలైన విషయం తెలి సిందే. ఇంటర్‌ ద్వితీయసంవత్సరంలో 2,95,550 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 1,64,598 మంది అమ్మాయిలు, 1,30,952 మంది అబ్బాయిలున్నారు. దీంతో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.