నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పాఠశాలలకు శుక్రవారం నుంచి ఈనెల 25 వరకు 13 రోజులుపాటు విద్యాశాఖ దసరా సెలవులను ప్రకటించింది. జూనియర్ కళాశాలలకు ఈనెల 19 నుంచి 25 వరకు ఏడు రోజులు సెలవులిచ్చింది. ఈనెల 26 నుంచి పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో తరగతులు పున:ప్రారంభమవుతాయి. శనివారం నుంచి 24 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని కాలేజీలకు దసరా, బతుకమ్మ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 25న కాలేజీలు పున:ప్రారంభమవుతాయి. అయితే దసరా పండుగ సెలవును ఈనెల 24న కాకుండా 23వ తేదీకి రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసిన విషయం తెలిసిందే. ఈనెల 14 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది.