
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యా దినోత్సవంలో భాగంగా మీర్ పేట్ కార్పొరేషన్ లలిత నగర్ లో పౌర పాఠనాన్ని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో 25 పౌర పఠన కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2500 జనాభా ఉన్న ప్రాంతాల్లో ఈ పఠన కేంద్రాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మొదటగా పైలట్ ప్రాజెక్ట్ గా రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 5 కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 30కి చేరాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల పౌర పఠన కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సిద్దాల పద్మ అంజయ్య, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.