మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం

– రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనార్టీలకూ రూ. లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం అందించనున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించా రు.ఇందుకనుగు ణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మైనార్టీలకు ఆర్థిక సాయానికి సంబంధించి సీఎం మాట్లాడుతూ కుల,మతాలకు అతీతంగా పేదరికాన్ని పారద్రోలాలనే దార్శనికతతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదని తెలిపారు. వారి అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి చేస్తున్నాయని వెల్లడించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్పలితాలను అందిస్తున్నదని వివరించారు. భిన్న సంస్కృతులను, మత, ఆచార సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తూ రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్‌ను కాపాడే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.