నేపాల్‌ లో వరద బీభత్సం

– 148 మంది మృతి
ఖాట్మండూ (నేపాల్‌) : నేపాల్‌లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడడం, వాగులు వంకలు పొంగి పొర్లడంతో ఇప్పటివరకు 148 మంది చనిపోయారు. 59 మంది గల్లంతయ్యారు. పదకొండు జల విద్యుత్‌ ప్రాజెక్టులు దెబ్బతినిపోయాయి. విద్యుత్‌ ప్రాజెక్టులకు జరిగిన నష్టం 245 కోట్ల దాకా ఉంటుందని ప్రాథమిక అంచనా. ఇది కాకుండా ఆస్తినష్టం కూడా పెద్దయెత్తున ఉన్నట్లు నేపాల్‌ విద్యుత్‌ శాఖ మంత్రి దీపక్‌ ఖద్కా తెలిపారు.కొండచరియలు విరిగి పడడం వల్ల పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది.