ఉచిత వైద్య శిభిరాలు గ్రామీణ ప్రాంతాలకు వరాలు..

– వైద్య శిభిరం ప్రారంభోత్సవంలో సర్పంచ్ నర్సింగరావు
– ఎస్ వీ ఆస్పత్రి ఉచిత వైద్య శిభిరానికి స్పందన
నవతెలంగాణ-బెజ్జంకి
ఉచిత వైద్య శిభిరాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు గోప్ప వరం లాంటివని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బోయినిపల్లి నర్సింగరావు అన్నారు. అదివారం మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో రేవోజు ఎల్లమ్మ పాపయ్య స్మారకార్థం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్వర్యంలో కరీంనగర్ ఎస్ వీ ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిభిరాన్ని సర్పంచ్ నర్సింగరావు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సుమారు 500 మంది రోగులకు ఉచిత బీపీ,మధుమేహం వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఎస్ వీ ఆస్పత్రి వైద్య బృందం, గ్రామస్తులు హజరయ్యారు.