ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం దుబ్బ రోడ్డులోని సార్వజనిక్ స్మశాన వాటికలో గత నాలుగు రోజుల క్రితం ఆనారోగ్యంతో గుర్తు తెలియని వృద్దుడు మృతిచెందగా 1వ ఠాణా యస్.హెచ్.వో అనుమతితో అనాధ శవానికి అంత్యక్రియలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరిగిందని ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ ఠాణా పోలిస్ సిబ్బంది అమీద్ ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు దారం గంగాధర్, ఈ.సి మెంబర్ కాసుల సాయితేజ, చందా జగన్మోహన్, మద్ది గంగాధర్ , కిరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.