భూపాలపల్లిలో గద్దర్ అంస్మరణ సభ..

నవతెలంగాణ – జయశంకర్ భూపాలపల్లి: జిల్లా లోని భారత్ ఫంక్షన్ హాల్ లో18.08.2023(శుక్రవారం)  రోజున గద్దర్ సంస్కరణ సభ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అజ్మిరా జంపయ్య నాయక్ అధ్యక్షతన గద్దర్ సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతుంది. అని ఒక ప్రకానటలో గద్దర్ సంస్కరణ సభ నిర్వహణ కమిటీ ప్రధాన సలహాదారు దండు రమేష్ తెలిపారు.  దీనికి ముఖ్య అధితులుగా మిట్టపల్లిసురేందర్, ఏపూరి సోమన్న రానున్నారు కావున ప్రజాస్వామికవాదులు, గద్దర్ అన్న అభిమానులు, విద్యావంతులు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమ కారులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరూ పాల్గొని సభని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు