‘అతడు’, ‘ఖలేజా’ వంటి సినిమాల తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లతో సినిమా రూపొందుతున్న విషయం విదితమే. మహేష్ బాబు కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలు. ఇటీవల విడుదలైన మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్కి అద్భుతమైన స్పందన లభించింది. గుంటూరు మిర్చిలా ఉన్నాడంటూ అభిమానులు మురిసిపోయారు. వెండితెరపై వింటేజ్ మహేష్ని చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్స్టార్ కష్ణ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్ ఆర్టీసీక్రాస్రోడ్స్లోని సుదర్శన్ థియేటర్లో అభిమానుల సమక్షంలో ‘ఎస్ఎస్ఎంబి 28’ టైటిల్, గ్లింప్స్ రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. సూపర్ స్టార్ అభిమానుల కేరింతల నడుమ, అభిమానుల చేతుల మీదుగానే ‘మాస్ స్ట్రైక్’ పేరుతో గ్లింప్స్ను విడుదల చేశారు. అలాగే మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ ఫిల్మ్కి ‘గుంటూరు కారం’ అనే శక్తివంతమైన టైటిల్ పెట్టారు. టైటిల్ని బట్టి చూస్తే, ఇది గుంటూరు నేపథ్యంలో రూపొందతున్న యాక్షన్ ఫిల్మ్ అని అర్థమవుతోంది. టైటిల్ని వెల్లడిస్తూ విడుదల చేసిన ‘మాస్ స్ట్రైక్’ అంచనాలకు మించి ఉంది. మహేష్ చిటికెతో గ్లింప్స్ ప్రారంభమైంది. కర్రసాముతో రౌడీ గ్యాంగ్ని చితక్కొడుతూ ఆయన అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. గళ్ళ చొక్కా, తలకి ఎర్ర కండువాతో ఉన్న మహేష్ సరికొత్త లుక్ ఆకట్టుకుంటోంది. మహేష్ని మునుపెన్నడూ చూడని మాస్ అవతార్లో త్రివిక్రమ్ చూపించబోతున్నారని స్పష్టమైంది. నోటిలో నుంచిబీడీని తీసి, దానిని స్టైల్ గా వెలిగించి ‘ఏంది అట్టా చూస్తున్నావు.. బీడీ 3డీలో కనపడుతుందా” అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి ఎప్పటిలాగే ఫిదా చేశారు మహేష్. భారీ బ్లాస్ట్ తో జీప్ గాల్లో ఎగరగా, మహేష్ తన కాలి దుమ్ముని దులుపుకొని నడుస్తున్నట్లుగా వీడియోని ముగించిన తీరు మెప్పిస్తోంది. అలాగే తమన్ నేపథ్యం సంగీతం కట్టిపడేసేలా ఉంది అని చిత్ర బృందం తెలిపింది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.