– కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ-మల్హర్రావు/మహదేవ్పూర్/మహాముత్తారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాముత్తారం, మహదేవ్ పూర్, మల్హర్ రావు, పలిమెల మండలములోని గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన దళిత బందు, గహలక్ష్మి, బీసీ బందు, మైనార్టీ బంధు పథకాలలో అర్హులను అధికారులు ఏ విధంగా గుర్తించడం జరిగిందో, పూర్తి వివరాలు తెలుపుతూ, జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు భూపాలపల్లి కలెక్టర్ భవేస్ మిశ్రాకు వినతిపత్రం ద్వారా శనివారం కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మహదేవ్ పూర్, మల్హర్ రావు, పలిమెల మండలాల్లోని ఆయా గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు, బీసీ బందు, గహలక్ష్మి, మైనార్టీ బంధు ప్రభుత్వ పథ కాలలో అర్హులను అధికారులు గుర్తించి మండల అభివృద్ది అధికారుల ద్వారా లబ్దిదారులను విచారణ చేసి తుది, జాబితా ప్రకారం జిల్లా అధికారులు అర్హులను గుర్తించి వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున, ఈ లబ్దిదారుల జాబితాలో అనర్హులైన వారిని కూడా ఈ గుర్తించినట్లుగా తన దష్టికి వచ్చినందున ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బందు, బీసీ బందు, గహలక్ష్మి, మైనార్టీ బందు ప్రభుత్వ పథకాలలో ఏ విధంగా అధికారులు గుర్తించడం జరిగిందో పూర్తి సమాచారం తెలుపుతూ జిల్లా అధికారులతో వెంటనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయా లని కలెక్టర్ కోరడం జరిగిందన్నారు.