2012లో రిలీజైన ఎస్ఎంఎస్ (శివ మనసులో శతి) సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది రెజీనా కసాండ్రా. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఫ్యాన్ బేస్ను పెంచుకుంది. ముఖ్యంగా రొటీన్ లవ్స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో మంచి పేరుని సొంతం చేసుకుంది. రెజీనా ప్రస్తుతం ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్లో ‘సూర్పనగై’ (తెలుగులో నేనేనా..?)అనే సినిమాను చేస్తోంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ, అలీ ఖాన్, జై ప్రకాష్ వంటి కీలక నటులు నటిస్తున్నారు. శ్యామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. ‘జాంబిరెడ్డి’ సినిమాతో మంచి హిట్
అందుకున్న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ పై ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ను సెన్సార్ సభ్యులు ఇచ్చారు. సినిమా విభిన్నంగా ఉందని, మంచి కంటెంట్తో వస్తుంది అంటూ మూవీ యూనిట్ని సెన్సార్ సభ్యులు అభినందించారు.