నవతెలంగాణ-తుంగతుర్తి
అన్నివర్గాల అభివద్ధి సంక్షేమమే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్గౌడ్ అన్నారు.ఆదివారం తుంగతుర్తి పట్టణ కేంద్రానికి సంబంధించిన 231వ బూత్లో బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు సంతోష్గౌడ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ మేరకు సీఎం కేసీఆర్ సారధ్యంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివద్ధి సాధించిందన్నారు.అభివద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు.పల్లె పట్నం గ్రామం తండా అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాలు అభివద్ధిలో పరుగులు పెడుతున్నాయన్నారు.నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ కారు గుర్తుపై ఓటేసి మూడోసారి గెలిపించడం ద్వారానే సాధ్యమవుతుందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పుల నాగమల్లు, ఉప్పుల వీరయ్య, వీరయ్య, జవ్వాజి నాగరాజు, నారబోయిన అనిల్, నాగవెల్లి రమేష్,గుండెబోయిన రవి, మెంతబోయిన భిక్షం, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.