– ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
న్యూఢిల్లీ : దేశ అభివృద్ధి మార్గం ఉదారవాద ప్రజాస్వామ్యంలో ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. భారత అభివృద్ధి పథం దాని అంతర్గత బలాలను ఉపయోగించుకోవడం, ప్రపంచ సరఫరా గొలుసులకు కీలకమైనదిగా మారడంతో అందరికీ గౌరవమైన చారిత్రాత్మక సంస్కతిని నిర్మించడం ద్వారా కీలకమైనదిగా మారిందని చెప్పారు. సేవల పరిశ్రమలో భారతదేశానికి నాయకత్వ పాత్ర పోషించే అవకాశం ఉన్నదనీ, ఈ ప్రయత్నంలో ప్రపంచం విశ్వాసాన్ని సంపాదించడానికి దేశం యొక్క ఉదారవాద ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం ఆర్థిక అవసరమని నొక్కి చెప్పారు. విశ్వసనీయమైన ప్రపంచ సరఫరాదారుగా మరింత నేరుగా తయారీ లేదా సేవల సర్వీస్ కాంపోనెంట్పై దష్టి పెట్టడం ద్వారా భారతదేశం ప్రయోజనం పొందుతుందని అన్నారు. ”మన స్వతంత్ర న్యాయవ్యవస్థ, మన ఉదారవాద ప్రజాస్వామ్యం, మనం ఈ ఉత్పాదక సేవ-నేతత్వంలోని వద్ధి పథంలోకి వెళ్లాలంటే ఇవి క్లిష్టమైన ప్రయోజనాలు. ఎందుకంటే ఇది ప్రపంచం యొక్క నమ్మకాన్ని సంపాదించడానికి వీలు కల్పిస్తుంది. ఇది అంతర్గతంగా అవసరం” అని ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో రాజన్ తన ప్రధాన ప్రసంగంలో అన్నారు. ”మనం భారతీయులుగా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. కానీ మనం విశ్వసించగలమనీ, ఈ రకమైన సేవలను సమర్థవంతంగా అందించగలమని ప్రపంచాన్ని ఒప్పించేలా ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటున్నాం. మన సంస్థలను బలోపేతం చేయడంలో, మన పటిష్టతలో మనం మన హౌంవర్క్ చేయాలి” అని తెలిపారు.