లండన్‌కు చేరుకున్న కల్వకుంట్ల కవిత

– ఎన్నారైలు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఘన స్వాగతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు తెలంగాణ మోడల్‌పై కీలకోపన్యాసం చేయడానికి వెళ్లిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం లండన్‌ చేరుకున్నారు. లండన్‌ విమానాశ్రయంలో కల్వకుంట్ల కవితకు ఎన్నారైలు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11.30 గంటలకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ”ఎక్స్‌ ప్లోరింగ్‌ ఇన్‌ క్లూసివ్‌ డెవలప్‌మెంట్‌: ద తెలంగాణ మోడల్‌” అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. కీలక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గణనీయమైన పురోగతిపై ప్రజంటేషన్‌ ఇస్తారు. వ్యవసాయం, విద్యుత్తు, విద్య, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై తెలంగాణ సాధించిన ప్రగతిని అంతర్జాతీయ వేదికపై ఆమె ఆవిష్కరించనున్నారు.