కెసిఆర్ రిమోట్ మోడీ చేతిలో..

– దొరల తెలంగాణ వద్దు ప్రజా తెలంగాణ కావాలి

– అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్క విజయం సాధిస్తుంది
– వచ్చే ఎన్నికల్లో దొరల తెలంగాణ పోయి ప్రజల తెలంగాణ వస్తుంది “కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ
– ఆరు గ్యారంటీలు చట్టాలుగా..
–  కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని బహిరంగ సభ వేదికగా పిలుపు
నవతెలంగాణ – వేములవాడ 
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు కేవలం హామీలు కావు వాటిని ఓ చట్టంగా మార్చి పక్కగా అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రినేత రాహుల్ గాంధీ అన్నారు ఒకవేళ హామీల అమలు చేయని పక్షంలో ప్రశ్నించండి అని పేర్కొన్నారు ఎన్నికల ప్రచారం భాగంగా వేములవాడ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులను అభిమానులను నియోజకవర్గ ప్రజలను కోరారు.
వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు.1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో నేడు కల్వకుంట్ల కుటుంబం కబంధహస్తాల మధ్య బంధీ అయిందని, బీఆర్ఎస్ సర్కారు ప్రజల కళలను నాశనం చేసిందని, విద్యార్థుల భవిష్యత్తును పక్కనపెట్టి కుటుంబ భవిష్యత్తును చూసుకుందని అన్నారు.
 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా,గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్య వికాసం, ఆరు గ్యారెంటీలను తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి డబ్బులను బయటకు తీసి ప్రజలకు పంచుతామన్నారు, నరేంద్ర మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతిలో ఇద్దరూ భాగస్వాములనే అన్నారు. మోదీ ప్రభుత్వం తన ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిందని, నా ఇంటిని కూడా ఖాళీ చేసేందుకు పూనుకుందని మండిపడ్డారు. దేశ సంపదను ప్రధాని మోదీ తన స్నేహితులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు.
అధికారంలోకి వచ్చాక రెండు లక్షల కొలువులు
ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో పేదలకు హామీ ప్రకారం ఇల్లు కట్టించలేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో, మిషన్ భగీరథలో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. రైతుల భూముల దోపిడీకి పాల్పడ్డారని, దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం తెలంగాణలో ఉందన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని.. ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ 24 గంటల్లోపు చేస్తామన్నారు..