సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
నవతెలంగాణ-తలకొండపల్లి
నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ నిలిస్తుందని, దీంతో పాటు పేదలకు ఎంతో భరోసాను ఇస్తుందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన యాదయ్య బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇటీవలే చెరువులో పడి మృతిచెందాడు. వారికి పార్టీ సభ్యత్వం ఉన్నందున్న ప్రమాద బీమా మంజూరైన రూ. 2 లక్షల చెక్కును గురువారం వారికి కుటుంబానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, సీఎల్ శ్రీనివాస్ అందజేశారు. కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమ్మరి శంకర్, అంతారం బిఆర్ఎస్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.