ఓవర్సీస్‌లో లైవ్‌ కన్సర్ట్స్‌

నార్త్‌ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లతో లైట్‌ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్మాత టీజీ.విశ్వప్రసాద్‌ అధ్వర్యంలో నార్త్‌ అమెరికన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహిం చింది. రీసెంట్‌గా యువ గాయకుడు రామ్‌ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్‌ కన్సర్ట్‌లు నిర్వహించారు. ఈ షోస్‌కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. ఇక తాజాగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ.విశ్వప్రసాద్‌, నాసా ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌తో ఇదే మాదిరిగా మ్యూజిక్‌ కన్సర్ట్‌లను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌ వేదికగా చిరంజీవి అధికారికంగా లాంచ్‌ చేసి, దేవిశ్రీ ప్రసాద్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కన్సర్ట్‌ జులై 2న డల్లాస్‌, జులై 8న ఫిలడెల్ఫియా, జులై 15న సియాటెల్‌, జులై 22న సాన్‌జొస్‌, జులై 29న చికాగోలో జరగునున్నాయి.
ఈ కన్సర్ట్‌లో సింగర్‌ ఇంద్రవతి, సాగర్‌, గీతా మాధురి, హేమ చంద్ర, రీటా, పద్వి, మౌనిక పాడనుండగా,. యాంకర్‌, నటి అనసూయ ఈ షోస్‌కి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.