దామోదరను సన్మానించిన మందకృష్ణ

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్య్లుసీ)శాశ్వత సభ్యుడిగా నియమించినందుకు ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సన్మానించారు. మంగళవారం హైదరా బాద్‌లోని ఆయనకు శాలువా కప్పి అభినందించారు.
కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు బక్క జడ్సన్‌ ఉన్నారు.