అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి..

నవతెలంగాణ – రేవల్లి
మండల కేంద్రంలో మంత్రి నిరంజన్ రెడ్డి  సోమవారం గ్రామంలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్ర్యక్రమాలు చేపట్టిన, పాత తండా గ్రామ పంచాయతీలో నిర్మించిన (ST) కామ్మ్యూనిటి భవనం & తల్పునూర్ గ్రామంలోని గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవాలు చేశారు, అలాగే నూతన కార్యక్రమముల శంకుస్థాపన పనులను ప్రారంభించిన ” ఉర్దూ పాఠశాల కాంపౌండ్ వాల్,  సబ్ సెంటర్ , చర్చి కాంపౌండ్ వాల్  ” ను శంకుస్థాపన చేసి  మధ్యాహ్నం భోజనం చేసుకొని తదానంతరం  గొల్లపల్లి గ్రామంలోని  గ్రామపంచాయతీ భవనం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీపీ సేనాపతి, జెడ్పిటిసి భీమయ్య, ” ఎంపీటీసీలు శ్రీశైలం, చిన్న కృమతి రెడ్డి ”   నాగర్ కర్నూల్ మార్కెట్ డైరెక్టర్ తెప్ప సురేష్,  ( సర్పంచులు )  గౌతమి శివరాం రెడ్డి, నాగపూర్ జ్యోతి శ్రీను, పార్వతమ్మ  తిరుపతయ్య, గొల్లపల్లి సర్పంచ్ సునీల్ కుమార్, సింగిల్ విండో లోడే రఘు, సురేందర్ రెడ్డి, రేవల్లి గ్రామ రైతు బంధు అధ్యక్షుడు కాల కుర్మయ్య, వార్డ్ మెంబర్స్, మండల పార్టీ అధ్యక్షులు, యువత అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు,  మరియు మండల ప్రజానికం అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.