
వరదలు వచ్చి ప్రాణాలు పోయి పంట నష్టం జరిగి ఆస్తి నష్టం జరిగి రహదారులు దెబ్బతిని 15 రోజులు పై బడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శనివారం మండలంలోని చంద్రు తండా మరియు కర్లపల్లి గ్రామాల్లో వరదల వల్ల ఇండ్లు మునిగిపోయిన బాధితులకు, వరదల వల్ల కొట్టుకుపోయిన పంట పొలాలను పరిశీలించి, జెన్యూన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ, క్లౌడ్ నారద అండ్ అశోక్ మరియు రవీందర్ బాబు ల సహకారంతో ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ వరదల వల్ల నష్టపోయి ఇండ్లు కూలిపోయిన బాధితులకు ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరదల వలన ప్రాణాలు కోల్పోతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫాంహౌస్ యందు ఉంటు పట్టించుకోకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా వరద బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని కోరగా ఇంతవరకు ఎటువంటి నష్ట పరిహారం అందజేయలేదని, అలాగే భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు ముందుగా హెచ్చరించిన కూడా ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇంత నష్టానికి పరోక్షముగా కారకులయ్యారు అని అన్నారు. ములుగు నియోజకవర్గంలో నేను స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా వరద బాధితులకు కనీస అవసరాలను తీరుస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అని, కానీ మీరు మాత్రం కనీసంగా వరదల గురించి మాట్లాడకుండా ఉండడం విడ్డూరంగా ఉందని, వరదల్లో చిక్కుకుని మృతి చెందిన కుటుంబాలకు వెంటనే 25లక్షల రూపాయలు, ఇండ్లు కోల్పోయి సర్వస్వం కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి, వంట సామాగ్రి కొరకు లక్ష రూపాయల సహాయం, నీట మునిగిన ఇండ్లకు లక్ష రూపాయల సహాయం అందించాలని, అలాగే వరదల వల్ల పొలాల్లో ఇసుక మేటలు పెట్టి పంటలు దెబ్బతిన్నాయని, ఎకరానికి 30,000/- రూపాయల తక్షణ సహాయం అందించాలని సీఎం కెసిఆర్ గారిని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవియాదవ్, ఎస్.సి. సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సితారాంనాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, బీసీ సెల్ మండల అధ్యక్షులు పౌడాల ఓం ప్రకాష్, గుండేబోయిన రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి తదితర నాయకులు పాల్గొన్నారు.