– నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముస్లిం సోదరులు జరుపుకునే మొహర్రం త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు తెలిపారు. నాటి కాలంలో ఇమామ్ హసన్, ఇమామ్ హుస్సేన్ సహా పలువురి త్యాగాలను స్మరించుకుంటూ ఈ పండుగ సాగుతుందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్యాగాలకు గుర్తుగా రాష్ట్రవ్యాప్తంగా హిందూ, ముస్లిం సోదరులు తరతరాలుగా మొహర్రంను నిరహిస్తున్నారని వివరించారు. పీర్ల పండుగ పేరుతో రాష్ట్రంలో హిందూ, ముస్లింల సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా ఈ పండుగ నిలిచిందని తెలిపారు. హిందువులు హసన్, హుస్సేన్లను ఆశన్న, ఊశన్నల పేర్లతో పీరీలను ఎత్తుకుని పాటలు పాడుకుంటూ, వారి త్యాగాలను పేరుపేరునా కీర్తిస్తారని పేర్కొన్నారు. త్యాగానికి చిహ్నంగా నిప్పుల గుండాలపై నడుస్తారని వివరించారు. గంగా జమున తెహజీబ్కు ప్రతీకగా నిలిచి, దేశానికే ఆదర్శంగా లౌకికవాద స్ఫూర్తిని మొహర్రం నింపుతుందని తెలిపారు.
కేసీఆర్కు వంశీధర్రావు ధన్యవాదాలు
బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర ఇన్చార్జీగా తనను నియమించడం పట్ల కల్వకుంట్ల వంశీధర్రావు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో శుక్రవారం ఆయన కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు.