కేటీర్ సమక్షంలో ఐటీ హబ్ కి ఎంఓయులు

– నిజామాబాదు ఇట్ హబ్ కి 8 కంపెనీల ఒప్పంద పత్రాలు వెల్లడించిన మహేష్ బిగాల
నవతెలంగాణ – కంటేశ్వర్
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలని సంకల్పంతో కేటీర్ ముందుకు తీసుకెళ్తున్నారు అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన సమావేశంలో 100 కంపెనీల సీఈఓ లతో మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు. కేటీర్ మాట్లాడుతూ. . తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలోనూ విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించడంతో పాటు ఇక్కడ ఉన్న అనుకూలతలు, తాము కల్పించిన మౌలిక వసతులపై మాట్లాడారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ లలో ఐటీ టవర్లను ప్రారంభించుకున్నామన్న కేటీఆర్, త్వరలోనే సిద్దిపేట, నిజామాబాద్ , నల్గొండలోనూ ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కాబోతుందని చెప్పారు. దీంతోపాటు ఆదిలాబాద్ లోనూ మరొక ఐటీ టవర్ నిర్మిస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్ తో జరిగిన సమావేశం అనంతరం నిజామాబాద్ ఇట్ హబ్ లో భాగంగా 8 ఐటీ కంపెనీల ప్రతినిధులు నిజామాబాదు ఐటి హబ్ లో కార్యకలాపాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటి ఉద్యోగాలు రాబోతున్నాయి. పరోక్షంగా ఎన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ సమావేశాన్ని గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల ఇట్ల సర్వ్క్ష్‌ ప్రతినిధులు లక్ష్‌ చేపూరి, విజయ్‌ రంగినేని సహకారముతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఈ విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.తెలంగాణ అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ఈ ఒప్పందాల ఫలితంగా తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎన్నో ఐటి ఉద్యోగాలు రాబోతున్నాయి. పరోక్షంగా మరో వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. తెలంగాణలోని పట్టణాల్లో ఐటీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు తెలుగు ఎన్ఆర్ఐలతో పాటు అనేకమంది నాన్ తెలుగు ఎన్ఆర్ఐలు కూడా ముందుకు వచ్చారు.