ఆధార్‌ లేకపోయినా పట్టాదార్‌ పాస్‌పుస్తకం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పట్టాదార్‌ పాస్‌ పుస్తకం జారీకి ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్‌ జిల్లా కొత్రేపల్లి గ్రామానికి చెందిన అమీనా బేగం 6.02 ఎకరాలకు పాస్‌ పుస్తకం కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంటే, ఆధార్‌ నెంబర్‌ లేదని అధికారులు పాస్‌ బుక్‌ ఇవ్వలేదు. దీంతో ఆమె హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం సూరేపల్లి నందా విచారించారు. ఆధార్‌ నంబర్‌ లేని కారణంగా పాస్‌ పుస్తకం జారీ చేసేందుకు అధికారులు నిరాకరించారని లాయర్‌ టీ బాలస్వామి చెప్పారు. ఆధార్‌ లేకపోయినా పాస్‌బుక్‌ ఇవ్వాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.