– కళాజాత బృందంతో మూడ నమ్మకాల పన అవగాహన
నవ తెలంగాణ-జక్రాన్ పల్లి: తేదీ:08-11-2023 నాడు గౌరవనీయులైన నిజామాబాద్ పోలిస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళాబృందం వారి ఆధ్వర్యంలో జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కలిగొట్ గ్రామంలో ప్రజలకూ ఓటు విలువ పై చక్కని నాటిక, పాటలతో అవగాహనా కల్పించారని ఎస్సై తిరుపతి గురువారం తెలిపారు. రాబోతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పండుగను అందరు ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఓటు విలువ తెలుసుకో – ఓటు హక్కను అందరూ వినియోగించుకోవాలని కోరారు. వాహనదారులు హెల్మెట్ ధరించాలి- హెల్మెట్ బరువు కాదు బాధ్యత గుర్తు చేశారు.
జీవించు జివించనివ్వు- రోడ్డు భద్రత నియమాలు పాటించు. మహిళల భద్రత కోసం రక్షణగా నిజామాబాద్ షీ టీమ్ రక్షణ కల్పిస్తుంది. కళాజాత బృందం తెలిపారు. నిజామాబాద్ నిజాంబాద్ షీ టీం 8712659795 లేదా 100 కి ఫోన్ చేయగలని పాటల ద్వారా తెలియజేశారు. మొబైల్ ఫోన్ దొంగిలించిన, పోగొట్టుకున్న సిఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరి చేయడం జరుగుతుంది ప్రజలకు అవగాహన కల్పించారు. అత్యవసరసమయంలో డయల్ 100 ఉపయోగించుకోవాలని సూచించారు. మూడ నమ్మకాలు నమ్మవద్దు – మంత్ర తంత్రాలు పారద్రోలాలి. ప్రతి గ్రామంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేసుకోవాలి, సీసీ కెమెరాలు వల్ల గ్రామం సురక్షితంగా ఉంటుంది, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలియజేశారు. ఆన్లైన్ మోసాలు గురించి అప్రమత్తంగా ఉండాలని వివరించారు,దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1930 చేయగలరని తెలిపారు.
గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండండి. నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులకు మాయమాటలు, లేనిపోని ఆశలు, అత్యశలు చూపించి మోసం చేస్తున్నారు, కావున ప్రజలు జాగ్రత్తగా ఉండండి. అందరూ శాంతియుతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలని పాటల ద్వారా తెలిపారు. సమాజంలో జరుగతున్న నేరాలు, చట్టాల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం సభ్యులు మరియు దాదాపూ 150 మంది ప్రజలు పాల్గొన్నారు.