తల్లీ బిడ్డలను కాపాడిన మల్లారెడ్డి నారాయణ సూపర్ స్పెషాల్టీ వైద్య బృందం
నవతెలంగాణ-సిటీబ్యూరో
సూరారం కాలనీకి చెందిన దంపతులు పరమేష్ చౌదరి, విమల చౌదరి మార్చి 7వ తేదీ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్కు వచ్చి గర్భంకు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విమల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో గర్భం దాల్చిన 29వ వారంలో తీవ్రమైన ప్రీ ఎక్లాంప్సియాతో ఉన్న వాస్తవ పరిస్థితి తీవ్రతను గుర్తించిన వైద్యుల బృందం అలాంటి క్లిష్ట పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం శాయశక్తులా కృషి చేసి శిశువును ప్రసవించ డానికి ముందస్తుగా అత్యవసర ఎల్ఎస్సీఎస్ నిర్వహి ంచారు, ”తల్లి నెలలు నిండక క్రిటికల్ కండిషన్లో అడ్మిట్ చేయబడినప్పటికీ, హాస్పిటల్ సిబ్బంది ఐదు రోజుల్లో రోగి రక్తపోటును స్ధిరపరచి నిలకడుంచారు. కేవలం 29 వారాల గర్భధారణ వయస్సులో ప్రసవిం చిన బేబీ 890 గ్రాముల బరువుతో జన్మించింది. మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్లోని వైద్య నిపుణులు వెంట నే శిశువుకు ముందుగా ప్రసవానికి సంబంధించిన అడ్డంకులను తొలగించి ఇంటెన్సివ్ మెడికల్ని ఉపయో గించి వైద్య చర్యలు చేపట్టారు. తక్కువ సర్ఫ్యాక్టెంట్ కారణంగా శ్వాసకోశ ఇబ్బంది కేవలం ఈ సమస్యల్లో ఒకటి. అయినప్పటికీ, శిశువు తల్లి బేబీ విమల గొప్ప ధైర్యాన్ని కనబరిచి వైద్యానికి సహకరించారనీ, ఆమెకు ఇంట్యూబేషన్ చేసి వెంటిలేటర్పై ఉంచినప్పుడు చికిత్సకు బాగా స్పందించింది. ఆమె మొత్తం హాస్పిట ల్లో ఉన్న సమయంలో బేబీ విమల రెండుసార్లు ఇంట్యూబేట్ చేయబడింది. యాంత్రికంగా వెంటిలేషన్ చేయబడింది, పీఐసీసీ లైన్ రెండుసార్లు ఉపయో గించారు. హాస్పిటల్లో అందుబాటులో ఉన్న 3వ స్థాయి ఎన్ఐసీయూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మరింత వైద్య సంరక్షణ నిచ్చే నిపుణులైన నియోనాటల్ కేర్ టీమ్ అప్రమత్తమైన పర్యవేక్షణలో, బేబీ విమల బరువు పెరగడమే కాకుండా (కేవలం 70 రోజుల్లో 710 గ్రాములు!) అత్యంత కీలకమైన అనారోగ్యాలను అధిగమించింది. ఈరోజు పాప విమల బరువు 1600 గ్రాములు. మల్లారెడ్డి నారాయణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్లోని నియోనాటాలజిస్ట్ డాక్టర్ దీపా డి.శెట్టి మాట్లాడుతూ ”మేం ఇచ్చే ప్రత్యేకమైన పోషకాహారం, నిరంతర పర్యవేక్షణలో శిశువు సరైన పెరుగుదల, శ్రేయస్సును నిర్ధారించడానికి తగిన వైద్య బృందం కలిగి ఉన్నందున ఖచ్చితమైన చికిత్స ప్రణాళికను ఉపయోగించాం. ”ఇంత తక్కువ వ్యవధిలో బేబీ విమల సాధించిన పురోగతికి మేం చాలా సంతోషిస్తు న్నాం” అని తెలిపారు. సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ కె.రాజశేఖర్ మాట్లాడుతూ ”మేం సాధించిన ఈ విజయానికి మా బృందం నిజంగా చాలా కష్టపడ్డాం. ఇప్పుడు బేబీ విమలలో ఎలాంటి అనారోగ్య అసాధా రణతలు లేవు అని నమ్ముతున్నాం. బేబీ విమల సాధారణ జీవితాన్ని గడపగలదని మేం ఆశిస్తున్నాం” అని తెలిపారు. ఈ సమావేశంలో వైద్యులు డాక్టర్ కె.రాజవేఖర్రావు, డాక్టర్ దీపా ధరనప్పా, డాక్టర్ ఎల్.ప్రణతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.