– డీయూజే డిమాండ్
న్యూఢిల్లీ : ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (ఈజీఐ)కి వ్యతిరేకంగా మణిపూర్ పోలీసులు నమోదు చేసి న ఎఫ్ఐఆర్ను ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (డీయూజే) తీవ్రంగా ఖండిం చింది. ఈ ఎఫ్ఐఆర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేర కు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మణిపూర్లో సుమారు నాలుగు నెలల నుంచి కొనసాగుతున్న హింసాకాండపై ఈజీఐ నిజ నిర్ధారణ బృందం ఇటీవల 24 పేజీలతో కూడిన ఒక నివేదికను వెల్లడించింది. ఈ నివే దికను సవాల్ చేస్తూ ఒక స్థానిక సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఈ బృందంలోని సభ్యులు సీమా గుహ, సంజరుకపూర్, భరత్ భూషణ్తో పాటు ఇజిఐ అధ్యక్షులు సీమా ముస్తాఫాపై ఎఫ్ఐఆర్ నమోదయింది. తటస్థ నిపుణులతో కూడిన ఈజీఐ ఇచ్చిన నివేదిక పక్షపాతమని ఆరోపించడం అసంబద్ధమని డీయూజే ఖండించింది.