నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలోని ఎస్సీ కాలనీలో డ్రైనేజీ, మురికి కాలువలను ఎంపీఓ రఫీ హైమద్, గ్రామ కార్యదర్శి రాజు కూలీలచే శుభ్రం చేయించారు. స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తా చెదారం త పాటు ముళ్ళకంపలను తొలగించారు. ఈ కార్యక్రమంలో కారోబర్ బాబా, అంగన్వాడీ కార్యకర్త శాంత, గ్రామ సంఘం అధ్యక్షురాలు, పారిశుధ్య కార్మిలు, కూలీలు పాల్గొన్నారు.