నవతెలంగాణ- మోపాల్
మోపాల్ మరియు మీగత మండలాలకు సంబంధించిన ఎస్ డి ఎఫ్ నిధులు బుధవారం రోజున ఎమ్మెల్యే 25 లక్షల రూపాయల విలువగల ఎస్డిఎఫ్ ప్రోసిడింగ్ పత్రాలను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్, జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘ సభ్యులు ధర్పల్లి జడ్పిటిసి శ్రీ బాజీరెడ్డి జగన్మోహన్ గారి చేతుల మీదుగా కుల సంఘ సభ్యులకు పంపిణీ చేశారు మోపాల్ మండలం పాంగ్ర డివిజన్4 ద్వారకా గ్రూప్ బిల్డింగ్ గీతా భవన్ గురించి 5 లక్షల రూపాయల ఎస్ డి ఎఫ్ నిధులు అందజేత.. వివిధ కమ్యూనిటీ సోదరులు తమ సొంత స్థలంలో భవన నిర్మాణం చేసుకుంటామని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, కలిసి కోరగా.ఈ మేరకు ఆయన నిధులనుండి కేటాయిస్తూ ప్రొసీడింగ్ ఆర్డర్స్ పత్రాలను సంబంధిత వివిధ కమ్యూనిటీ కుల సంఘ సభ్యులకు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా వివిధ కమ్యూనిటీ కుల సంఘ సభ్యులు తదితరులు ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ కి, జిల్లా యువ నాయకులు జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు ధర్పల్లి జెడ్పిటిసి శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంత రం ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పడ్డాక అన్ని కులాలు వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి గౌ.శ్రీ. కేసీఆర్ ఇంతగానో కృషి. చేస్తున్నారు. అనితెలుపడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీ ఆర్ పాలనలో ర్ర్రాష్ట్రప్రజలందరూసంతోషంగాఉన్నారూఅనిఅన్నారు.నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 47 కోట్లు ఎస్ డి ఎఫ్ మరియు సి డి పి నిధులతో చాలావరకు కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడం జరిగింది. ఇంకా జరుగుతున్నాయి, ప్రతి గ్రామంలో ఇప్పటివరకు 25 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతి గ్రామ గ్రామాన సిసి రోడ్స్ డ్రైనేజీలు నిర్మాణం పనులు పూర్తి చేయడం జరిగింది ఇంకా మరిన్ని జరుగుతున్నాయి అని తెలిపారు.