మంత్రి సబితా ఇంద్రారెడ్డికి షాక్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మంత్రి సబితా ఇంద్రారెడ్డికి షాక్‌ తగిలింది. మహేశ్వరం మండల ఎంపీపీ రఘుమారెడ్డి, మాజీ సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా విజయభేరి సభ విజయవంతం చేయడం కోసం అసెంబ్లీ ‘కోఆర్డినేటర్ల’ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ నియమిచారు.